వర్షం లేకుండా చేపల వర్షం ఎలా పడుతుంది అని అనుకుంటున్నారా.అవునండి ఇది నిజమే వర్షం లేకుండానే చేపల వశం కురిపిస్తున్నారు అధికారులు.
మాములుగా వర్షం పడుతున్నప్పుడు చేపల వర్షం పడడం చాలా మంది చూసే ఉంటారు.కానీ వర్షం లేకుండా అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసు కుంటే చేపల వర్షం ఎలా పడిందో మీకే అర్ధం అవుతుంది.
సముద్రాలు, నదులు మీదుగా వీచే సుడిగాలుల కారణంగా నీటి లోని చేపలు ఆ గాలి వల్ల మేఘాల మీదకి చేరుకుంటాయి.ఆ మేఘాల్లోని చేపలు వర్షం పాడేటప్పుడు ఆ వర్షం తో పాటు భూమి మీదకు పడతాయి.
దానినే మనం చేపల వర్షం అని అంటాం.అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మేఘాల్లో నుండి పడే చేపల వర్షం కాదు.
మనుషులు కురిపించే చేపల వర్షం ఇది.,/br>
అమెరికాలో ఉటా ఆ దేశంలోని చెరువుల్లో, నదుల్లో విమానాల ద్వారా వెలది చేపలను ఆ నీటిలోకి వదులుతున్నారు.ఈ వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.అయితే ఆ నదులకు, చెరువుల దగ్గరకు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడం వల్ల విమానాల ద్వారా వెలది చేపలను ఆ నీటిలోకి వదిలి పెడుతున్నారు.
విమానం ద్వారా ఒకేసారి 35 వేల చేపలను నీటిలో వేయవచ్చని అధికారులు చెబుతున్నారు.ఉటా చెబుతున్న ప్రకారం ఈ విధానాన్ని కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్నామని ఇలా చేయడం వల్ల మత్స సంపద పెరగడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేకూరు తుందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వ్యారల్ అయ్యింది.దానిని మీరు కూడా చూసేయండి.