రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.అసెంబ్లీ స్థానాలు పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.
పొరుగు పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, నేతలను తమ పార్టీలోకి తీసుకుంటు న్న అధికార పార్టీలకు ఉన్న ఏకైక మార్గం.అసెంబ్లీ స్థానాల పెంపే! ఈ క్రమంలోనే గత చంద్రబాబు సర్కారు కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొన్నప్పుడు.
అసెంబ్లీ స్థానాలను పెంచాలం టూ.నరేంద్ర మోడీకి విన్నపాలపై విన్నపాలు చేసింది.అయితే.అప్పట్లో ఆయన 2024 ఎన్నికల నాటికి పెంచేందుకు రెడీ అయ్యారు.
ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పారు.ఇక, ఇప్పుడు వైసీపీ కూడా.
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.వాస్తవానికి ఎక్కడ ఎవరిని తీసుకున్నా.
అక్కడ వైసీపీకి కీలకమైన అభ్యర్థులు ఉన్నారు.అయినా కూడా టీడీపీ నుంచి తీసుకుంటున్నారు.
దీనికి కీలక కారణం.వచ్చే ఎన్నికల సమయానికి అసెంబ్లీ స్థానాలు పెరగకపోతాయా? అనే ధీమా! నిజానికి రాష్ట్ర విభజన చట్టంలోనే అసెంబ్లీ స్థానాల పెంపును పేర్కొన్నారు.దీని ప్రకారం ఏపీకి 25 స్థానాలు పెరగనున్నాయి.దీంతో ఇప్పుడు న్న 175 స్థానాలు 200కు చేరనున్నాయి.
అయితే.ఇప్పుడు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చిన మాటలను బట్టి.ఇప్పట్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.ఎప్పటికప్పుడు జనాభా నిష్పత్తిని బట్టి.
అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను పెంచుతున్నారు.ఈ క్రమంలో పార్లమెంటు స్థానాలను 2026లో పెంచుతున్నట్టు
ప్రధాని
మోడీ పేర్కొన్నారు.
వాస్తవానికి రెండు కూడా అంటే.అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు కు కూడా ఒకే సారి స్థానాలను పెంచు
.