దేశంలో కరోనా వల్ల నెలకొంటున్న దారుణం అయిన పరిస్దితులు పేద ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.ఈ దుస్దితి ఇలాగే కొనసాగితే ఆకలి చావులు కూడా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ చేస్తున్న మరణమృదంగం భయంకరంగా ఉంది.ఈ నేపధ్యంలో తెలంగాణలో కూడా పరిస్దితులు దిగజారిపోతుండగా, ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
ఇకపోతే ఈ రాష్ట్రంలో సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తూ ఊహించని స్దాయిలో కరోనా కేసులను నమోదు చేస్తుంది.ఇదిలా ఉండగా ఏపీలో కొత్తగా 20.11 శాతాని పాజిటివిటీ రేటు చేరుకుందని, టెస్ట్ చేసిన ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తోందని అధికారులు తెలియచేస్తున్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో 35 వేల టెస్టుల్లో 7,224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యాయంటే కరోనా వ్యాప్తి ఏతీరులో ఉందో అర్ధం చేసుకోవచ్చూ.
అంతే కాకుండా కోవిడ్ టెస్టులు పెరిగితే కేసులు భారీగా నమోదు అయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.