సమాజాన్ని తీర్చిదిద్దే వారిలో తల్లిదండ్రుల పాత్ర తర్వాత ఎక్కువ పాత్ర ఉపాధ్యాయుడికి ఉంటుందని అందరికీ తెలిసిందే.పిల్లల భవిష్యత్తును పాఠశాలల తీర్చిదిద్దే రీతిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతూ పిల్లలకోసం వెచ్చించే సమయం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది.
అటువంటి చదువు చెప్పే ఉపాధ్యాయుని నరికి చంపిన ఘటన తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఉపాధ్యాయుడిని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి చంపేశారు దుండగులు.
వివరాల్లోకి వెళితే భగీరథ కాలనీలో నరహరి అనే వ్యక్తి స్కూల్ లో టీచర్ గా పనిచేస్తూ పిల్లలకు పాఠాలు చెబుతూ జీవిస్తూ ఉన్నాడు.అటువంటి వ్యక్తిని చాలా దారుణంగా నరికి చంపేశారు.
చంపేసిన తర్వాత యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నాన్ని దుండగులు చేసినట్లు సమాచారం.కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో గొడవల కారణంగానే జగదీష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి చంపినట్లు నరహరి బంధువులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.