నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.ఈ మేరకు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు అయింది.
లోక్ సభ స్పీకర్ పంపిన ఆహ్వానాలు ప్రోటోకాల్ ప్రకారం లేవని పిటిషన్ లో పేర్కొన్నారు.పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం రేపు విచారణ జరపనుంది.
అయితే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ తో పాటు మొత్తం 19 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.కాగా ఈనెల 28న పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.