ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కోసం అంటూ ఆనాటి రాజులను గద్దెదించి అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఇప్పుడు అక్కడ రాజులకు వారసులుల వ్యవహరిస్తూ నియంత పరిపాలనను అక్కడ పునరావృతం చేస్తున్నారు.ఈ నియంతృత్వ ధోరణి తోనే పొరుగు దేశాల భూములను మింగేయాలి అనుకోవడం ఉగ్రవాదులకు పుట్టినిల్లయిన పాకిస్తాన్ లాంటి దేశాలకు సహాయ సహకారాలు అందించడం వంటి వాటికి కారణమవుతుంది.
ఇది ఏ మాత్రం ప్రపంచదేశాలకు రుచించడం లేదు అందుకే తమ ధోరణి మార్చుకోమని చైనాకు సూచిస్తున్నాయి.వీటిని పట్టించుకోని చైనా తనకు నచ్చింది తాను చేసుకుంటూ పోతుంది.
తాజాగా కరోనా చైనాలోని షింజియాంగ్లో ఎక్కువగా ఉన్నది.దీన్ని కంట్రోల్ చేయడం కోసం చైనా ప్రభుత్వం అక్కడి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది.దానితో అధికారులు ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు.కరోనా వ్యాక్సిన్ ను తయారు చేయడం కోసం ప్రజల చేత రకరకాల మందులను,మాత్రలను బలవంతంగా మింగిస్తున్నారు.
దానికి నిరాకరించిన వారిని, అధికారులను ఈ వ్యవహారంపై ప్రశ్నించిన వారిని తీసుకెళ్ళి జైళ్లు, ఇతర నిర్బంధ కేంద్రాల్లో బంధిస్తున్నారు.
ప్రస్తుతం ఇది ఇంటర్నేషనల్ మీడియా బాగా టచ్ చేస్తుంది.
వీటిని కవర్ చేసుకోవడానికి ప్రస్తుతం చైనా భారత్ తో బోర్డర్ టెన్షన్స్ ను మరిన్ని క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.