కేంద్ర ప్రభుత్వం, వాహనదారులకు ఓ ముఖ్య ప్రకటన ను జారీ చేసింది.టోల్ ఫ్లాజ వద్ద జనవరి ఒక్కటి నుండి నగదు చెల్లింపులకు ఫుల్ స్టాప్ పెట్టబోతుంది.
అందుకు 2017 నుండి అమలులో ఉన్న ఫాస్టాగ్ ను పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురానున్నది.ఇప్పటివరకు రెండు వరసల్లో మాత్రమే నగదు చెల్లింపులు జరుగుతుండగా, ఆ వరసల్లోనూ ఫాస్టాగ్ విధానం ద్వారా మాత్రమే నగదు చెల్లింపు జరగాలని కేంద్రం నిర్ణయించింది.
ఇకపై అన్నీ వరసల్లో కి ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువస్తున్నట్లుగా కేంద్ర స్పష్టం చేసింది.ఫాస్టాగ్ లేని వాహనాలు ఫాస్టాగ్ లైన్ లోకి వస్తే అంతకు రెండింతలు టోల్ ఫ్లాజ రుసుమును వసూలు చెయ్యనున్నది.
ప్రతి టోల్ ప్లాజాకు కిలోమీటర్ దూరంలో ఫాస్టాగ్ విక్రయాలు ప్రారంభించాలని కేంద్రం సూచించింది.కనిష్టంగా రెండు, గరిష్టంగా ఎనిమిది ఫాస్టాగ్ విక్రయాలు, రిచార్జ్ లు జరుగుతాయి.దేశవ్యాప్తంగా 70 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నట్లుగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఒక్క తెలంగాణలోనే 75 శాతం వాహనాలు ఫాస్టాగ్ ను కలిగి ఉన్నాయి.
రాష్ట్రంలోని అన్నీ టోల్ ఫ్లాజల వద్ద విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి 24 గంటలు విక్రయాలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించింది.జనవరి ఒక్కటో తేదీ నుండి అన్నీ టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకనున్నది.