వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారం రావాలని ఇప్పటి నుండే నేతలను సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే.175/175 టార్గెట్తో పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ముందుగానే ప్రేపరషన్ అవుతున్నారు. మిషన్-175 క్యాంపయిన్తో ముందుకు వెళ్తున్నారు.వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి, అవకాశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీలతో సర్వేలతో రిపోర్ట్లతో తెప్పించుకుంటున్నారు.ఈ నివేదక అధారంగా లక్ష్యానికి చేరువయే ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే ఈ సర్వే వివరాలను కీలక నేతలతో పంచుకుంటున్నారు.అయితే ఈ సర్వే వివరాలను ఓ కీలక నేత తన అనుచరులకు వివరించినట్లుగా వివరించారు.జగన్కు వివిధ సర్వేల నుండి కీలక ఫీడ్బ్యాక్ అందుకున్నారని, ప్రస్తుతానికి కనీసం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ బలహీనంగా ఉందని సర్వేలో వెల్లడైందని వెల్లడించారు.దీంతో ఆయన ఈ నియోజకవర్గాలపై దృష్టి సారించారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కని నేతలు, ఇతర రాజకీయ పార్టీల వైపు చూస్తున్న, పార్టీలో కొనసాగుతూ పార్టీ అవకాశాలను దెబ్బతీసే నేతలపై ఆయన ఇప్పటికే ఓ కన్నేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఇలాంటి నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు పార్టీ సీనియర్ నేతలతో జగన్ వరుస మంతనాలు జరుపుతున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనీసం ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ పార్టీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని సదరు నేత వారికి చెప్పినట్లుగా తెలుస్తుంది.వారిలో ఒక ఎమ్మెల్యే జంట ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రారంభించగా, మరికొందరు అంతర్గతంగా జగన్పై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్నారు.
వారితో పాటు 11 మంది అలాంటి ఎమ్మెల్యేల జాబితాను జగన్ సంపాదించారని సమాచారం.వారు పద్దతిని మార్చుకోవాలని వారిని జగన్ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.







