ఏపీలో రెండేళ్లు ముందగానే.ఎన్నికల వేడి రాజుకుంది.
ప్రతిపక్ష పార్టీలు సై అంటే సై అంటూ.అధికార పార్టీపై విమర్శలు ఎక్కు పెడుతున్నాయి.
జనసేన పార్టీ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అయింది.దానికి తోడు జనసేన పార్టీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీతో పొత్తుకు రెఢీ అయింది.
దాదాపు 30 నుంచి 40 అసెంబ్లీ సీట్ల వరకూ జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.తక్కువలో తక్కువ జనసేనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల్లో బాగంగా 30 అసెంబ్లీ సీట్లు అప్పజెప్పినా.
జనసేనకు కావల్సినంత బలం చేకూరుతుంది.
వచ్చిన సీట్లలో దాదాపు అన్నిటినీ గెలవాలని జనసేన భావిస్తోంది.
అందుకే వాళ్లనీ వీళ్లనీ కాకుండా.తన కుటుంబ సభ్యులనే నిలుచోబెట్టాని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ను జనసేన పార్టీలోకి తీసుకు వచ్చే అవకాశం ఉంది.రామ్ చరణ్ ను అసెంబ్లీకి తనతో పాటు పవన్ తీసుకు వెళ్లాలని చాలా కాలంగా భావిస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఒక వేళ అదే నిజం అయితే.జనసేన తరపున రామ్ చరణ్ రంగంలోకి దిగుతారు.
మరో వైపు టీడీపీ ఈ సారి ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపాలని చూస్తోంది.తారక రత్న హెల్త్ ఇష్యూతో.దానికి బలమైన బీజాలు పడ్డాయి.తాత పెట్టిన పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.
వెంటనే వస్తానని తారక్ ఎప్పుడో చెప్పారు.దాన్ని నిజం చేయడానికి.
టీడీపీని అధికారంలోకి తీసుకుని రావడానికి తారక్ ను రంగంలోకి దించే చాన్స్ ఉంది.చంద్రబాబు అనుకున్నట్టు తారక్ రంగంలోకి దిగితే.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిబులార్ సినిమా రిపీట్ అవ్వడం ఖాయం అని అభిమానులు అంటున్నారు.
బ్రిటీష్ దొరను ఎదిరించడానికి అల్లూరి, కొమురం భీమ్ లు ఏకమైనట్టు.జగన్ ను ధిక్కరించడానికి తారక్, చరణ్ లు ఏకమవుతారని పోస్టులు పెడుతున్నారు.త్రిబులార్ సీన్ ను రాజమౌళి డైరెక్ట్ చేసినట్టు.
అసెంబ్లీ ఎన్నికల సీన్ ను చంద్రబాబు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది.చూడాలి మరి తారక్, చరణ్ లు పొలిటికల్ ఎంట్రి ఎప్పుడు ఇస్తారో.