నూతన బడ్జెట్లో మహిళలు, వృద్ధులకు వీలైనంత చోటు కల్పించారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కోసం కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్లు, మహిళలకు కొంత ఉపశమనం మరియు రాయితీని ఇచ్చారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కోసం వన్-టైమ్ సేవింగ్స్ స్కీమ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను ప్రకటించారు.అదే సమయంలో, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)లో పెట్టుబడి పెట్టవలసిన గరిష్ట మొత్తాన్ని రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు కూడా ప్రకటించారు.
మహిళల కోసం వన్-టైమ్ సేవింగ్స్ స్కీమ్
మహిళలకు ప్రకటించిన వన్-టైమ్ సేవింగ్స్ స్కీమ్ మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ కింద, వారు రెండేళ్లపాటు 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో పొదుపు చేయగలుగుతారు.ఈ పొదుపు స్త్రీ లేదా ఆడపిల్ల పేరు మీద చేయవచ్చు.
ఇందులో గరిష్ట డిపాజిట్ మొత్తం ₹ 2 లక్షలుగా నిర్ణయించారు.అలాగే మీరు పథకం నుండి మీ డబ్బును ముందుగానే విత్డ్రా చేసుకోవచ్చు.“మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్” కింద చిన్న పొదుపు చేయవచ్చు.మహిళలు మరియు బాలికలకు ఈ డిపాజిట్ సౌకర్యం 7.5 శాతం వడ్డీ రేటుతో రెండేళ్ల పాటు ఉంటుంది” అని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
మహిళా రైతులకు సాధికారత కల్పిస్తామని హామీ
ఇది కాకుండా దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద, మహిళల ఆర్థిక సాధికారత కోసం గ్రామీణ మహిళలకు చేయూతనిచ్చేందుకు 81 లక్షల స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.పెద్ద ఉత్పాదక సంస్థలు లేదా క్లస్టర్ల ఏర్పాటు ద్వారా ఈ సమూహాల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించనున్నామన్నారు.
సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన వరాలివే…
మరోవైపు, సీనియర్ సిటిజన్ల గురించి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) లో పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తాన్ని 30 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.ఈ మొత్తం ఇప్పుడు 15 లక్షల రూపాయలు.అంతే కాదు పోస్టల్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ లోనూ పరిమితిని పెంచారు.ఇప్పుడు రూ.4.5 లక్షలకు బదులు రూ.9 లక్షలను ఒకే పేరుపై పెట్టుబడి పెట్టవచ్చు.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉందని గుర్తించండి.అయితే అవసరమైతే ఈ మొత్తాన్ని ముందుగానే విత్డ్రా చేసుకోవచ్చు.