తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభన ఎలాగుందో అందరికి తెలిసిందే.ఇంతలా కరోనా వ్యాప్తి జరుగుతున్న ఎన్నికల హడావుడి మాత్రం తగ్గడం లేదు.
కాగా సాగర్ ఎన్నికల కారణంగా కొందరు ముఖ్య నేతలు కోవిడ్ బారిన పడిన సంగతి విదితమే.ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు.
ఇకపోతే గ్రేటర్ వరంగల్ ల్లో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఒక పరెషాన్ నెలకొంది.వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 9వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరుపున తనకు టికెట్ కేటాయించాలని కోరుతూ హన్మకొండ అంబేద్కర్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు దర్శన్సింగ్ అనే వ్యక్తి ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక సాధన ఉద్యమం మొదలైనప్పటి నుండి గులాభి పార్టీలో పని చేస్తున్నానని, కానీ ఈ పార్టీ పెద్దలు తనకు రాజకీయ అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పటికైన పార్టీ నన్ను గుర్తించి, పెద్ద నేతల నుండి హామీ వచ్చేంత వరకు తాను సెల్ టవర్పైనే ఉంటానని హెచ్చరిస్తున్నాడు.అయినా గానీ ఇలా సెల్ టవర్లు ఎక్కి బెదిరిస్తే మాత్రం భయపడిపోయి టికెట్ ఇచ్చే రోజులు పోయాయి అని ఇంకా తెలుసుకోలేక పోతున్నాడు ఈ అమాయక చక్రవర్తి అని అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన వారు.