కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ప్రతి రోజు కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ చర్యలకు ఉపక్రమిస్తూనే ఉంది.
తాజాగా యూపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో తంబాకు, గుట్కాలు తిని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే వెంటనే వారికి శిక్ష విధించడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాను విధించనున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.తాజాగా తెలంగాణలో కూడా అదే విధానంను కొనసాగించేందుకు సిద్దం అవుతున్నట్లుగా రాష్ట్ర ముఖ్య అధికారులు నోట్ను విడుదల చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ఇకపై రోడ్ల మీద లేదంటే బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా తెలిసి లేదా తెలియకుండా గుట్కా పాన్ పరాక్ వంటివి ఉమ్మి వేస్తే వెంటనే వారిని గుర్తించి శిక్షించబడుతోంది.బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంను పూర్తిగా నిషేదిస్తున్నట్లుగా ప్రకటించింది.
ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.