నేరాలు, ఘోరాలు చేసిన వాళ్లని జైలు పంపితే వారిలో పశ్చాత్తాపం కలిగి మార్పు రావడంతో పాటు వీరిని చూసి సమాజంలో నేరాలు చేయాంటే భయపడతారని ప్రభుత్వ ఉద్దేశ్యం.కానీ కొందరు మాత్రం జైలు నుంచి విడుదలయ్యాక కూడా పాత పద్దతిలోనే క్రిమినల్స్గానే జీవనం గడుపుతున్నారు.
తాజాగా ఓ నేరంపై అరెస్ట్ అయిన భారతీయుడొకడు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ కటకటాల పాలయ్యాడు.
ఢిల్లీకి చెందిన తరుణ్ మదన్ కొన్నేళ్లుగా న్యూజిలాండ్లో నివసిస్తున్నాడు.
సోషల్ మీడియాలో సిక్కు యువకుడిని బెదిరించడం సహా అతనిపై అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేసినందుకు గాను అక్లాండ్ పోలీసులు కొద్దిరోజుల క్రితం తరుణ్ని అరెస్ట్ చేశారు.నిందితుడు.
బాధితుడి ఫేస్బుక్ గ్రూప్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆ సిక్కు యువకుడు ఖలిస్తానీ ఉగ్రవాది అని ఆరోపిస్తూ పోస్ట్లు పెట్టాడు.అంతేకాకుండా అతని ఫోటోలను, ఫోన్ నెంబర్లను ఆన్లైన్లో వుంచాడు.
ఈ కుర్రాడు భారతీయులపై విద్వేషపూరిత ప్రచారం నిర్వహిస్తున్నాడని.అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కామెంట్లు పెట్టేవాడు.
అక్కడితో ఆగకుండా ఆ యువకుడికి పాఠాలు చెప్పేందుకు ఇంటికి వస్తానని బెదిరించేవాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.దీంతో భయాందోళనలకు గురైన సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు తరుణ్ని ఈ నెల 19న అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు.అనంతరం ఎంతో కష్టపడి బెయిల్పై బయటికొచ్చాడు.
అయితే బెయిల్ ఇచ్చేందుకు గాను న్యాయస్థానం విధించిన షరతులను తరుణ్ మదన్ ఉల్లంఘించాడు.దీంతో పోలీసులు అతడిని శుక్రవారం తిరిగి అదుపులోకి తీసుకున్నారు.
కాగా న్యూజిలాండ్ పక్కనే వున్న ఆస్ట్రేలియాలోని సిక్కు సమాజానికి చెందిన నేతలు భారతీయ- ఆస్ట్రేలియన్ సమాజంలో పెరుగుతున్న విభజనను గుర్తించారని ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది.సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతదేశంలో గత కొన్ని నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనే ఇందుకు కారణమని పేర్కొంది.అన్నదాతలకు కొందరు మద్ధతుగా నిలబడితే.భారత ప్రభుత్వానికి మరికొందరు బాసటగా నిలుస్తున్నారని గార్డియన్ వెల్లడించింది.భారత్లోని రైతుల నిరసను సాకుగా తీసుకుని మతపరమైన మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొందరు ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.గత నెలలో సిడ్నీలో నలుగురు సిక్కు విద్యార్ధులపై సాయుధులైన వ్యక్తులు దాడికి పాల్పడడ్డారు.
దీనిని ద్వేషపూరిత నేరంగా పోలీసులు అనుమానిస్తున్నారు.