భారత్ నుంచి పలు దేశాలకు ఉపాది కోసం ఎంతో మంది వలస వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా కువైట్ కు భారత్ నుండి వెళ్ళే వలస కూలీల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంటుంది.
అక్కడ వివిధ పరిశ్రమలలో, కార్మాగారాలలో పనిచేసే భారతీయుల సంఖ్య లెక్కకి మించి ఉంటుంది.ఇలా ఉపాది కోసం కువైట్ వెళ్ళిన 105 మంది భారతీయుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది.
ప్రస్తుతం తాము పడుతున్న కష్టాలను వివరిస్తూ భారత ఎంబసీకి ఓ లేఖను రాశారు.తమకు సాయం అందించమని వేడుకుంటూ అధికారులకి రాసిన లేఖ భారత ఎంబసీ ని కదిలించింది.
ఉపాధి కోసం కువైట్ వెళ్ళిన 105 మంది భారతీయులు షుయిబా పోర్ట్ వద్ద పనిచేయడానికి వెళ్ళారు.ఎన్నో ఆశలతో తమ ఆర్ధిక కష్టాలు గట్టెక్కుతాయని భావించిన వారికి సదరు పోర్టు నిర్వాహకులు జూన్ నుంచి జీతాలు చెల్లించకుండా ఆపేశారు.
దాంతో తీవ్రమైన ఆర్ధిక కష్టాలలో దిక్కు తోచని స్థితిలో తమ బాధను తెలుపుతూ మమ్మల్ని కాపాడండి అంటూ భారత ఎంబసీకి లేఖలు రాశారు.
అద్దెలు చెల్లించలేక పోతున్నామని, నిత్యావసర వస్తువులు కొనడానికి కూడా డబ్బులు లేవని ఆవేదన చెందుతున్నారు.
అద్దె ఇవ్వని కారణంగా యజమానులు నీటి సరఫరా నిలిపెశారని లేఖలో తెలిపారు.స్వచ్చంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఇచ్చే ఆహారంతో కడుపు నింపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యని పరిష్కరించి మమ్మలి కాపాడాలంటూ వేడుకున్నారు.వారు రాసిన లేఖపై స్పందించిన ఎంబసీ అధికారులు సదరు పోర్ట్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.