హుజూరాబాద్ రాజకీయాలు ఇప్పుడు ఎంతలా హాట్ టాపిక్గా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం.ఈ ఉప ఎన్నిక గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ను దక్కించుకుంది.
వాస్తవానికి గత చరిత్రలో లేనంత ప్రాముఖ్యతను కూడా సంపాదించుకుంది.ఈ ఒక్క ఉప ఎన్నికలో గెలిస్తే రాబోయే ఎన్నికల్లో గెలిచేసినట్టే అని ఫీల్ అవుతున్నారంటే దీన్ని ఎంతలా సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే నోటిఫికేషన్ కూడా రాకముందు నుంచే అనేక ట్విస్టులు ఇచ్చిన ఈ ఉప ఎన్నిక ఇప్పుడు నోటిఫికేషన్ తరవ్ఆత మరింత సీరియస్ గా సాగుతుంది.
కాగా ఇప్పుడు హుజూరాబాద్లో ఓ కామన్ సిచ్యువేషన్ చోటుచేసుకుంది.
అదేంటంటే అటు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ సతీమణి జము.అలాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్ భార్య అయిన శ్వేత హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.
భర్తలకు అండగా ఉంటూ వారి గెలుపు తాము ఏమీ తక్కువ కాదంటూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ఆడవారికి బొట్టు పెడుతూ తమ భర్తలకే ఓటు వేయాలంటూ కోరుతున్నారు.
ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ మంచి చెడులను అడుగుతూ తమ భర్తలనే గెలిపించాలంటూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా ఇందులో ఈటల రాజేందర్ భార్య జమున ఓ అడుగు ముందున్నారనే చెప్పాలి.ఎందుకంటే ఆమె నోటిఫికేషన్ రాకముందు నుంచే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.ఆమె భర్త తరఫున ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని కమలాపూర్ నుంచే తన ప్రచారాన్ని మొదలు పెట్టారు.
ఇప్పటికే చాలా మండలాలను ఆమె చుట్టేశారు.ఇక ఈటల ఒక మండలాన్ని చూసుకుంటే తాను ఇంకో మండలంలో ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతున్నారు.ఇక నోటిఫికేషన్ రావడంతో గెల్లు శ్రీనివాస్ భార్య కూడా రంగంలోకి దిగి ప్రచారం ప్రారంభించేశారు.
ఇలా పతుల కోసం సతీమణులు తెగ కష్టపడుతున్నారన్నమాట.
.