గుడివాడలో గడపగడపకు కార్యక్రమంలో కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!!

గుడివాడ నియోజకవర్గంలో 22 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి కొడాలి నాని ఈ రోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ డిసెంబర్ 21వ తారీకు సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో టిడ్కో ఇల్లు పంపిణీ చేస్తామని తెలిపారు.తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేద వాడు తను అడిగిన.2024 ఎన్నికలలో పోటీ చేయనని స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు.జగన్ జీవించి ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 In Gudivada Kodali Nani Comments In The Program Gadapa Gadapku ,   Gudivada, Kod-TeluguStop.com

పేదల కోసం సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేశారని… ఆయన కోసం పేదల అందరూ ఒకే వేదిక మీదికి రావాలని సూచించారు.జగన్ ముఖ్యమంత్రి ఉండకపోతే పేదల ఇల్లు లేక అల్లాడిపోయే వారని అన్నారు.

ఇక ఇదే సమయంలో ప్రతిపక్షాల పై విమర్శలు చేశారు.చంద్రబాబు పవన్ కళ్యాణ్ పని పాట లేక ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వైసీపీ ప్రభుత్వానికి.అనుకూల ఓటు మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 151 సీట్లు.మళ్లీ పక్కాగా వస్తాయని పేర్కొన్నారు.24 సీట్ల కోసం ప్రతిపక్షాలు పోటీ పడాలని కొడాలి నాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube