75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అంటరానితనం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ప్రాంతాలు పరిస్థితులు మనుషులు సమాజంలో ఉంటూనే ఉన్నారు.చట్టసభలలో దళితులను పైకి తీసుకు రావాలని రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా దళితులకు చేరలేని పరిస్థితి.
కేవలం ఓటు బ్యాంక్ అన్న తరహాలోనే రాజకీయ నాయకుల కోణం వారిపై ఉండటంతో చాలా ప్రాంతాలలో దళితులు ఇంకా అంటరానితనం ఎదుర్కొంటున్నారు.ఇదిలా ఉంటే తాజాగా గద్వాల్ జిల్లాలో బీసీలు దళితుల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు.
దళితులు ఊర్లోకి రాకుండా వెలివేసి తరహాలో వారి పట్ల వివక్ష చూపిస్తున్నారు. ;
కిరాణా దుకాణాలు అదేరీతిలో మంగళ షాపులకు దళితులు రాకుండా బీసీలు.
వ్యవహరించడం ఈ క్రమంలో దళితులు జిల్లా కలెక్టర్ కు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.ఇదే సమయం లో అంగన్వాడి సెంటర్ లో టీచర్ దళిత వర్గాలకు చెందిన ఆవిడ కావడంతో సెంటర్ కూడా మూసివేశారు.
ఇటువంటి పరిస్థితులలో గద్వాల్ జిల్లాలో దళితులు తమ ఎవ్వరు ఆదుకుంటారు అన్న తరహాలో ఎదురుచూస్తూ ఉన్నారు.ఎక్కడికక్కడ దళితుల పట్ల బీసీలు ఆంక్షలు విధించడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కిరాణా షాప్ హోటల్ లకి రాకుండా దళితులపై బీసీలు ఆంక్షలు విధించారు.గద్వాల్ జిల్లా.
గట్టు మండలం రాయకల్ లో.ఈ పరిస్థితులు నెలకొన్నాయి.