ఒకప్పుడు ఇన్ కమింగ్ మరియు ఔట్ గోయింగ్ కాల్స్కు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది.కాల క్రమేనా ఇన్కమింగ్ ఫ్రీ అయ్యింది.
ఔట్ గోయింగ్కు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది.ఔట్ గోయింగ్కు డబ్బులు చెల్లించాల్సి ఉండేది కనుక చాలా మంది మిస్డ్ కాల్స్ ఇస్తూ ఇతరులను విసిగిస్తూ ఉండేవారు.
కాని ఇప్పుడు మిస్డ్ కాల్స్ ఇచ్చే వారి సంఖ్య 99 శాతంకు తగ్గిపోయింది.ఎందుకంటే కాల్స్ అన్నీ కూడా ఫ్రీ వచ్చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ కాల్స్ను చేస్తుండటంతో పాటు ఒకప్పుడు ఒకటి రెండు నిమిషాలకే ఉంటున్న ఉంటున్న అంటూ చెప్పేవారు.కాని ఇప్పుడు గంటలు గంటలు మాట్లాడుతూ ఇంకా అంటున్నారు.
టెలికాం వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ మునుపటి రోజులు వచ్చేలా ఉన్నాయి.మళ్లీ మొదట్లో ఉన్నట్లుగా మిస్డ్ కాల్స్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చేలా ఉందని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం టెలికాం సంస్థలు అన్ని కూడా కొన్ని వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి.ఇలాంటి సమయంలో అన్ని సంస్థలు కూడా ఫ్రీ ఆఫర్లును తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది.
ఇకపై డేటా అయినా కాల్స్ అయినా విడి విడిగా కొనుగోలు చేయాల్సిందే.ఈ నిర్ణయంతో అంతా అవాక్కవుతున్నారు.
మళ్లీ మునుపటి తరహాలో రీచార్జ్లు చేసుకోవాల్సి రావచ్చు అంటున్నారు.జియోతో పాటు అన్ని టెలికాం సంస్థలకు కూడా ఇదే పరిస్థితి.