ప్రపంచ పటంలో అమెరికా కనుమరుగు కానుందా.?? భవిష్యత్తులో వచ్చే ముప్పుతో అగ్రరాజ్యం అస్తమయం అవుతుందా.?? అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు.పోలాండ్ కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జెర్జీ జాబా.
భూబాగాన్ని ఆతలాకుతలం చేయగల ఓ భారీ అగ్ని పర్వతం పేలుడు సమీపమలోనే ఉందని సదరు శాస్త్రవేత్త హెచ్చరిస్తున్నారు.ఆయన అంచనాల ప్రకారం.భవిష్యత్తులో అమెరికాలో ఓ భారీ అగ్నిపర్వత పేలుడు జరగనుందని.ఈ పేలుడు తో సుమారు 500 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం లావాతో మునిగిపోతుందని తెలిపారు.
అంతేకాదు ఈ పేలుడు వలన వచ్చే రసాయనిక వాయువులు భూ వాతావరణాన్ని పూర్తిగా కప్పెస్తాయని.ఈ ఎఫెక్ట్ తో చాలా కాలం వరకూ సూర్యుడు కనిపించడని హెచ్చరిస్తున్నాడు.
కృత్రిమ శీతాకాలంలో భూగోళం ఉండగానే.ఆహార కొరత ఏర్పడుతుందని దాంతో సుమారు 500 కోట్ల జనాభా అంతరించిపోతారని తెలిపారు.
ఈ అగ్నిపర్వత పేలుడును ఆపలేమని , అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు.
అమెరికాలో ఎప్పుడు అగ్ని పర్వతం పేలుడు సూచనలు వచ్చినా సరే వెంటనే ప్రజలు అప్రమత్తమై అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
ఇలాంటి పేలుళ్లను సూపర్ వాల్కనో ఎరప్షన్ అంటారని, ఇవి సుమారు 50 వేల ఏళ్లకు ఒక సారి వస్తాయని అన్నారు.ప్రపంచ చరిత్రలో ఇలాంటి ప్రమాదం చివరి సారిగా 74 వేల సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో సంభవించిన విషయం గుర్తు చేశారు.
అలాగే చరిత్రను ఒకసారి తిరగేస్తే అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో ఉన్న అగ్నిపర్వతం ఇప్పటికి మూడుసార్లు లావా ఎగజిమ్మిందని.ఇప్పటికే అక్కడ ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉన్నాయని అంటున్నారు.