ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.ఇక దేశవ్యాప్తంగా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది.
ఇక ఇలాంటి తరుణంలో 90 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారి నుండి బయటపడ్డాడు.పూర్తి వివరాల్లోకి వెళితే నోయిడాలోని ఆస్పత్రి నుంచి కరోనా బాధితులు 31 మంది ఇటీవల డిశ్చార్జి చేయడం జరిగింది.
ఇక కరోనా వైరస్ బారి నుంచి బయటపడిన వృద్ధుడు ఫోటో న్యూఢిల్లీకి సమీపంలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ ట్వీట్ చేయడం జరిగింది.
ఇక అందులో ఓ 90 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారి నుండి బయటపడ్డాడు… అంతటితో ఆయన ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యాడు.
నాలాంటి వాళ్ళకు ఈ వృద్ధుడు ఎంతో స్ఫూర్తి.అంతేకాకుండా మీరు ఇంకొన్నాళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఆశిస్తున్నాను అంటూ అతడు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.ఇక అంతే కాకుండా జూన్ 8 నుంచి అన్ని కార్యక్రమాలను జరిగే లేక తమ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు.
అలాగే ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ తమ రోజువారి పనులను కొనసాగించుకుంటున్నాము అంటూ ఆయన తెలియజేశారు.
ఇక కొత్తగా గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటి వరకు మొత్తం20 రంగాల్లో కొన్ని జిల్లాల గ్రామాల్లో 31 కేసులు నమోదవగా.
ఇతరులు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.