ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ ప్రాంతంలో.ప్రజలు.మరియు రైతులు అనేక ఇబ్బందులు ఎదురు కావడం తెలిసిందే.చేతికందిన పంట పొలాలు నీట మునగడం తో పాటు ఇల్లు కూడా కోల్పోవడం జరిగింది.ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరదల విషయంలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వరదల కారణంగా బాధితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కడప జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఇసుకాసురులు… బాధితులను పట్టించుకోకుండా గ్రామాలలో ఇసుక ట్రాక్టర్ల తో… క్యూ కట్టడం జరిగిందని దీనిని బట్టి జగన్ కి జనం కంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతున్నట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ నాయకుల దాహానికి 39 మంది జలసమాధి అయ్యారు.12 గ్రామాలు నీటమునిగాయి దాదాపు 1700 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని లోకేష్ స్పష్టం చేశారు.ఇటువంటి దీనావస్థలో బాధితులకు.కనీస న్యాయం జరగక ముందే కడప జిల్లా నందలూరు మండలం అడవూరు క్వారీలో… ఇసుక విక్రయాలు ప్రారంభించారని చెప్పుకొచ్చారు.ఇటువంటి తరుణంలో ఇసుక మాఫియాని అరికట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది అంటూ లోకేష్ ఆరోపణలు చేయడం జరిగింది.