నేనే సీఎం అవ్వొచ్చు అన్న కిషన్‌ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నేడు తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2024లో రాబోతున్నది బీజేపీ ప్రభుత్వం అంటూ ప్రకటించాడు.

 In Case Bjp Farm The Governament I Became A Cm-TeluguStop.com

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తాము మాత్రమే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొచ్చాడు.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలనకు స్వస్థి చెప్పబోతున్నట్లుగా మంత్రి అన్నారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ హవా ముందు టీఆర్‌ఎస్‌ వచ్చే ఎన్నికల్లో మట్టికరవడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవ్వొచ్చు లేదంటే ఒక సామాన్య కార్యకర్త అయినా సీఎం అవ్వొచ్చు.

అది పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని చెప్పుకొచ్చాడు.కాని 2024లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు.ఎన్నికలకు ఇంకా నాలుగు ఏళ్లకు పైగా ఉంది.ఇలాంటి సమయంలో అప్పుడే సీఎం అభ్యర్థి వరకు కిషన్‌ రెడ్డి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

తెలంగాణలో జరుగబోతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube