ఏపీలో ఆ ప్రాంతంలో లాక్ డౌన్..!!

దేశంలో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా విజృంభిస్తోంది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి.

 In Ap Lock Down In That Area Guntur, Battiproll, Andhra Pradesh-TeluguStop.com

దాదాపు 1000 కి దగ్గరలో కేసులు బయటపడుతూ ఉన్నాయి.ఇటువంటి నేపథ్యంలో ఏపీ వైద్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.

ఏ ఏ జిల్లాలో కేసులు పెరుగుతూ ఉన్నాయో, అక్కడ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం లో ఇటీవల ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో అక్కడ లాక్ డౌన్ విధించారు.

ఈరోజు నుంచి వారం రోజుల పాటు భట్టిప్రోలు లో లాక్ డౌన్ అమలులోకి రానుంది.ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యక్తి అవసరాలు కొనుగోలుకు అనుమతులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వారం రోజులలో పరిస్థితి బట్టి తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటాము అన్నది తెలియజేస్తామని అక్కడి తహసిల్దార్ శ్రవణ్ కుమార్ వెల్లడించారు.మరోపక్క ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మాస్క్ పెట్టుకొని వారిని పట్టుకోవడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలో మాస్కు ధరించకుండా దొరికిన వారికి భారీగా జరిమానా విధిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube