క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ( ODI World Cup Tournament ) మరి కాసేపట్లో గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం( Narendra Modi Stadium ) వేదికగా 1:30 గంటలకు ప్రారంభం అవ్వనుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్- రన్న రప్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ఉత్కంఠ భరితంగా ప్రారంభం అవ్వనుంది.2019 వన్డే వరల్డ్ కప్ విశ్వ విజేతగా ఇంగ్లాండ్ నిలిచిన సంగతి తెలిసిందే.ఇక ఫైనల్ మ్యాచ్ లో ఓడి న్యూజిలాండ్ రన్న రప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ రెండు జట్లు నేడు జరిగే మ్యాచ్ లో గెలిచి శుభారంభం తో టోర్నీ ప్రారంభించాలని బరిలోకి దిగనున్నాయి.అయితే తొలి మ్యాచ్ కు ముందు రెండు జట్లకు భారీ షాక్ తగిలింది.
న్యూజిలాండ్( New Zealand ) జట్టు స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ప్రపంచ కప్ కు ఒక నెల ముందు వన్డే రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకొని తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.అయితే నేడు జరిగే తొలి మ్యాచ్ కు స్టోక్స్ దూరమయ్యాడు.హిప్ నిగల్ తో స్టోక్స్ బాధపడుతున్నడని, అందుకే ఈ మ్యాచ్ లో అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ వెల్లడించాడు.తర్వాత మ్యాచ్లో అందుబాటులోకి వస్తాడని తెలిపాడు.
బెన్ స్టోక్స్ స్థానంలో హ్యారీ బుక్ ప్లేయింగ్ 11లొకి వచ్చే అవకాశం ఉంది.ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే.
ఓపెనర్ జేసన్ రాయ్( Jason Roy ) స్థానంలో బ్రూక్ ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్ జట్టులో స్టార్ ప్లేయర్ విలియమ్సన్, టిమ్ సౌథీ తొలి మ్యాచ్లో ఆడడం లేదు.
వీరి స్థానంలో గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.మరి కాసేపట్లో ప్రారంభం అయ్యే వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో ఏ జట్టు గెలిచి శుభారంభంతో టోర్నీ ప్రారంభిస్తుందో చూద్దాం.