భారత విమానాలు పొరుగుదేశం పాకిస్థాన్ గగనతలం పై రాకపోకలు సాగించకూడదు అంటూ ఆ దేశం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ లు తమ విదేశీ పర్యటనలు జరిగినప్పుడు కూడా పాక్ గగనతలం పై వారి విమానాలకు అనుమతి లభించలేదు.
అయితే తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం మలేషియా దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన విమానం భారతదేశ గగనతలం మీదుగా ప్రయాణించకూడదని ఆయనకు ఆయననే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఆ దేశ విమానయాన రంగ అధికారులు తెలిపారు.
పుల్వామా దాడి, భారత్ వాయుసేన దాడుల ఘటనల అనంతరం పాక్ తన గగనతలం మీదుగా భారత విమానాలు రాకపోకలు సాగించకుండా నిషేధం విధించింది.అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా పాక్ ఆ నిషేధాన్ని కొనసాగించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానం తన గగనతలంమీదుగా రాకపోకలు సాగించకుండా నిషేధించిన పాకిస్థాన్ తీరుపై భారతప్రభుత్వం అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థకు ఫిర్యాదు కూడా చేశారు.అయితే తాజాగా ఆయన మలేషియా లో పర్యటించాల్సి ఉండగా దానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విమానయాన సంస్థ తెలిపింది.