కోడికత్తి కేసులో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు.ఈ కేసుపై విచారిస్తున్న ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణకు బాధితుడు జగన్ కూడా హాజరుకావాలని ఆదేశించింది.
అదేవిధంగా కేసులో సాక్షి అయిన ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసు మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను న్యాయస్థానానికి సమర్పించాలని తెలిపింది.అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.