టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.ఇక ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు పూరీ తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇప్పటికే నేషన్ వైడ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.లైగర్ సినిమా క్లైమాక్స్ మిగతా చిత్రాలకు భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఒక్క క్లైమాక్స్ సీన్ మొత్తం 15 నిమిషాల నిడివితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్లైమాక్స్లో ఎమోషన్తో పాటు అదిరిపోయే ట్విస్టులు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ క్లైమాక్స్ సీన్లో విజయ్ దేవరకొండ యాక్టింగ్ మరో రేంజ్లో ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.కాగా యాక్షన్ సీక్వెన్స్ కూడా క్లైమాక్స్కు మరో ప్రాణంగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుండగా, ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తోంది.ఇక ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ సినిమాను పూరీతో కలిసి ఛార్మీ ప్రొడ్యూస్ చేస్తోండగా, బాలీవుడ్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ రిలీజ్ చేస్తున్నాడు.మరి లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.