ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హవా తగ్గడమే కాకుండా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ స్థాయి భారీగా పెరిగిపోయిందని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఐఎండిబి అత్యధిక ఆదరణ పొందిన సెలబ్రిటీల జాబితాలను విడుదల చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐఎండిబి జాబితాలో టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్న సెలబ్రిటీల జాబితాను కూడా విడుదల చేశారు.ఈ జాబితాలో అత్యంత ఆదరణ పొందిన హీరోలలో కోలీవుడ్ హీరో ధనుష్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
ఈయన టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.
మొదటి స్థానంలో ధనుష్ ఉండగా రెండవ స్థానంలో అలియా భట్ మూడవ స్థానంలో ఐశ్వర్యారాయ్ నాలుగవ స్థానంలో రామ్ చరణ్, మిగిలిన తర్వాతి స్థానాలలో వరుసగా సమంత, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనీయర్ ఎన్టీరామారావు, అల్లు అర్జున్, యశ్ నిలిచారు.ఇలా టాప్ టెన్ లో ఆరుగురు సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు కావడం విశేషం.అందులోనూ నెంబర్ వన్ స్థానంలో సౌత్ హీరో కావడంతో దక్షిణాది సినీ ప్రేక్షకులు సెలబ్రిటీలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.