ఈ మధ్య కాలంలో ప్రేమలు ఎందుకు పుడుతున్నాయో ఎలా పుడుతున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది… ఒకప్పుడైతే మనిషి మధ్య ఉండే బంధాలకు ఎంతో విలువ నిచ్చే వారు కానీ నేటి రోజుల్లో మాత్రం… బంధాలు లేదు బంధుత్వాలు లేదు.వావివరుసలు మరచి మరి ప్రేమించుకోవడం నిజంగా సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.
ఇలాంటి ఘటనే జరిగింది ఇక్కడ.హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేసే నేనావత్ రమేష్ అనే యువకుడు తనకి కూతురు వరస అయ్యే యువతితో ప్రేమలో పడ్డాడు.
ఇక వావివరుసలు మరచి ఏకంగా మూడేళ్లపాటు ప్రేమలో మునిగితేలారు వారిద్దరు.ఈ విషయం కాస్తా కుటుంబ సభ్యులకు తెలిసింది.రమేష్ ను మందలించిన కుటుంబ సభ్యులు యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు.ఇక తమ ప్రేమకు పెద్దలు సమాజం ఒప్పుకోదు అని భావించిన ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఇక ఆ తర్వాత రోజు రమేష్ కి స్పృహ వచ్చింది కానీ పక్కనే ప్రియురాలు మాత్రం అచేతనంగా పడి ఉండడంతో ప్రియురాలు చనిపోయింది భావించిన రమేష్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా రమేష్ అప్పటికే ప్రాణాలు కోల్పోగా యువతి కొనఊపిరితో చికిత్స పొందుతుంది.,ఇక ఆ యువతి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.