ఈమధ్య ప్రజలు కొత్త కొత్త ఆలోచనలతో నేరాలు చేస్తున్నారు.కొందరు ఎలా ఉన్నారంటే ఏదైనా నేరం చేద్దాం అనుకున్నప్పుడు ఆ విషయం మీద అంతర్జాలంలో వెతికి మరీ పూర్తిగా అవగాహన పొందిన తర్వాత దానిని అమలు చేస్తున్నారు కూడా.
ఇక అసలు విషయంలోకి వెళితే… ఓ ఇద్దరు తెలంగాణలోని మద్యం తీసుకువచ్చి ఏపీలో అమ్మడానికి విఫల ప్రయత్నం చేశారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… తెలంగాణ రాష్ట్రము నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు ఓ అంబులెన్సు వాహనం మితిమీరిన వేగంతో ప్రయాణించడం జరుగుతోంది.
దీనితో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు వచ్చిన అనుమానంతో ఆ ఇద్దరి వ్యక్తుల బండారం బయటపడింది.
మొదటగా ఆ వాహనాన్ని చూసిన ఓ కానిస్టేబుల్ తరవాతి స్టేజి లో ఉన్న చెక్ పోస్ట్ కు సమాచారం అందించి, ఆ అంబులెన్స్ ను ఒకసారి చెక్ చేయమని చెప్పగా తర్వాత స్టేజి లో ఉన్న పోలీసులు ఆ అంబులెన్స్ ను ఆపి తనిఖీ చేశారు.
ఇక అందులో భాగంగా అంబులెన్స్ లో ఉన్న శవపేటికను తెరిచి చూడగా అందులో ఏకంగా 107 మద్యం బాటిళ్లను వారు కనుగొన్నారు.
ఇక దీనిపై వారిని వివరణ కోరగా వారు తెలంగాణలో మద్యం కొన్ని ఏపీలో విక్రయించేందుకు మందు తీసుకు వెళుతున్నాం అని తెలియజేశారు.
దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు దాదాపు రెట్టింపు కావడంతో, తెలంగాణలో మద్యం కొని దానిని ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నామని వారు తెలియజేశారు.ఏది ఏమైనా మద్యం తరలించడానికి అంబులెన్సు తో భారీ స్కెచ్ వేశారు మేధావులు.