తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.టీఆర్ఎస్ పై ఆగ్రహం కలిగి ఉన్న వారందరూ బీజేపీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది.
అయితే గత రెండు సంవత్సరాల క్రితం వరకు బీజేపీ ఉన్న స్థితి ప్రస్తుతం బీజేపీ ఉన్న స్థితి మొత్తం వేరుగా ఉందన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.ఇక బండి సంజయ్ బీజేపీ అధ్యక్షునిగా నియామకం అయిన తరువాత బీజేపీలో కొత్త జోష్ అనేటటువంటిది వచ్చింది .దీంతో ఇక అప్పటి నుండి బీజేపీ కార్యకర్తలందరు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే చాలా వరకు క్షేత్ర స్థాయిలో ఇంకా పూర్తి స్థాయి కార్యకర్తల నిర్మాణం అనేది జరగలేదు కాబట్టి బీజేపీ కొంచెం ఆలోచిస్తూ అడుగులేస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇక పూర్తి స్థాయి కార్యకర్తల నిర్మాణం, కార్యవర్గం ఏర్పాటైతే ఇక రానున్న రోజుల్లో బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్య భీకర పోటీ ఉండే అవకాశం ఉంది.ఇక ఇప్పటికే దుబ్బాక, గోషామహల్, జీహెచ్ఎంసీ లలో కూడా బీజేపీ ప్రాతినిధ్యం ఉండడంతో ఇక వీటికి తోడు హుజూరాబాద్ లో కూడా బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది.
అయితే ఇక ఈ విజయంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.ఎందుకంటే టీఆర్ఎస్ కు కంచుకోట లాంటి హుజూరాబాద్ లో బీజేపీ సత్తా చాటిందంటే ఇక ఇతర నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు చాలా సునాయాసం అనేది బీజేపీ ఆలోచన.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు గెలుస్తుందా అంటే కొద్దిగా ప్రశ్నార్ధక విషయం అయినప్పటికీ ఒక వేళ బీజేపీ హవా గనుక కొనసాగితే ఏదైనా సంచలనం జరిగే అవకాశం లేకపోలేదు.మరి రానున్న రోజుల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.