యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ‘రంగ్ దే’ను ఇప్పటికే ప్రారంభించిన నితిన్, అటుపై చిత్రాలను కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.బాలీవుడ్లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన అంధాధున్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు నితిన్ రెడీ అయ్యాడు.
అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు పలువురు పేర్లను పరిశీలించిన చిత్ర యూనిట్, గోవా బ్యూటీ ఇలియానాను నటింపజేయాలని అనుకుంది.దీంతో ఆమెను ఈ సినిమాలో నటించాలని చిత్ర యూనిట్ కోరింది.
అయితే ప్రస్తుతం సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న ఇలియానా, ఈ ఆఫర్ను రిజెక్ట్ చేసింది.బాలీవుడ్లో టబు చేసిన పాత్ర చాలా బోల్డ్గా ఉండటంతో తెలుగులో అలాంటి పాత్రలను ప్రేక్షకులు ఎంతమేర ఆదరిస్తారో తెలియదని భావించిన ఇలియానా, ఇప్పట్లో అలాంటి పాత్రలు చేయనంటూ ఈ సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేసిందట.
దీంతో ఈ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టిని చిత్ర యూనిట్ సంప్రదించగా, ఆమె ఓకే అనేసింది.టాలీవుడ్లో ఒకట్రెండు సినిమాలు చేసిన శిల్పాశెట్టి, ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో నటించేందుకు ఒప్పుకోవడంతో ప్రేక్షకులు ఆమె ఎంట్రీపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఇక ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తుండగా నితిన్ హోమ్ బ్యానర్పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.