మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య చివరి దశ షూటింగ్ జరుగుతోంది.కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంపై కూడా జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు.
చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో విజయాన్ని ఆయన అందుకోవడం ఖాయం అంటున్నారు.ఇలాంటి సమయంలో చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించిన వార్తలు మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
వేదాళం మరియు లూసీఫర్ రీమేక్ లను చిరంజీవి చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.అయితే మొదట వేదాళం ఆ తర్వాత లూసీఫర్ అనుకున్నారు.
కాని ప్లానింగ్ చిన్న మార్పు వచ్చింది.
చిరంజీవి జనవరి నుండి లూసీఫర్ రీమేక్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ ను చిరంజీవి అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది.
ఇప్పటికే ఈయన దృవ సినిమాతో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అదే సినిమా తెలుగులో రావడంతో సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు లూసీఫర్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే బాధ్యత ఈయన తీసుకున్నాడు.తప్పకుండా ఇదో అద్బుత సినిమాగా ఆయన రీమేక్ చేస్తాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇలియానాను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది.హిందీలో ఒకటి రెండు సినిమాలు చేస్తున్న ఈమె సౌత్ లో ఒక పెద్ద సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలని ఆశ పడింది.
ఆ ఆశ ఈ సినిమాతో నెరవేరే అవకాశం కనిపిస్తుంది.ఇలియానా తో చిరంజీవి రొమాన్స్ పై మెగా ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్ తో ఉన్నారు.