తెలుగులో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుని హిందీ సినిమాల్లో ఆఫర్లు రావడంతో తెలుగుతెరకు దూరమయ్యారు ఇలియానా.బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని ఇలియానా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
అయితే హీరోయిన్లు ఎంత అందంగా కనిపించినా, ఎంత బాగా నటించినా కొందరు నెటిజన్లు హీరోయిన్లను ఏదో ఒక విషయంలో ట్రోల్ చేస్తూ ఉంటారు.
అలా ఇలియానాను కూడా నెటిజన్లు కొన్ని విషయాల్లో ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రోలింగ్ గురించి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ తన శరీరంలోని బ్యూటీ స్పాట్స్ ను వదిలేసి లోపాలను మాత్రమే ఎత్తిచూపుతున్నారని అలా చేయడం సరికాదని ఆమె అన్నారు.
తాను చూడటానికి నల్లగా ఉంటానని అంత పొడవు కూడా కాదని ఆమె అన్నారు.
తన చేతులు సన్నగా ఉంటాయని.ఎదభాగం తనకు నచ్చదని ఆమె తెలిపారు.పెదవులు, ముక్కు కూడా సరిగ్గా ఉండవని ఇలియానా పేర్కొన్నారు.
తనలోని నెగిటివ్స్ ను ఇలియానానే ఇలా ఓపెన్ గా ఇంటర్వ్యూలో చెప్పుకోవడం గమనార్హం.తెలుగులో ఈ మధ్య కాలంలో ఇలియానా అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో నటించారు.
ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో ఇలియానాకు తెలుగులో ఎవరూ ఆఫర్లు ఇవ్వలేదు.
అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ సమయంలో లావుగా కనిపించిన ఇలియానా ఆ తరువాత వ్యాయామాల ద్వారా బరువు తగ్గి పూర్వపు స్థితికి చేరుకున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఇలియానా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నా ఆమెకు ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు.2021 సంవత్సరంలోనైనా ఇలియానా వరుస అవకాశాలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.