టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన గోవా బ్యూటీ ఇలియానా.ఈ అమ్మడు తెలుగులో పోకిరి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో జత కడుతూ నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో ఆమె చివరిగా జులాయి సినిమాలో నటించి తెలుగు సినిమాలకి విరామం ఇచ్చి బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది.అక్కడ భాగానే గుర్తింపు తెచ్చుకున్న అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ తో ఇలియానా అక్కడ ఆడిపాడింది.అయితే విదేశీ వ్యక్తిని ప్రేమించి అతనితో ఎక్కువటైం స్పెండ్ చేస్తూ సినిమాల మీద ఫోకస్ తగ్గించడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
ఇక అతనితో బ్రేక్ అప్ తర్వాత మళ్ళీ బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది.ప్రస్తతం ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత తెలుగుని కొంత చిన్న చూపు చూసింది.అయిన కూడా రవితేజ మళ్ళీ ఈమెకి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అవకాశం ఇచ్చాడు.
ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు.దాంతో మళ్ళీ బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది.
అయితే మరోసారి తెలుగు మేకర్స్ నుంచి ఇలియానాకి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది.నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న హిందీ రైడ్ మూవీలో ఇలియానాని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
దాంతో పాటు తమిళంలో సూపర్ హిట్ అయిన చతురంగ వెట్తై సినిమాని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ సినిమా కోసం కూడా ఇలియానాని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.
తెలుగులో రవితేజతో ఇలియానా ఎక్కువ సినిమాలు చేయడంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఈ నేపధ్యంలో తెలుగులో ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి రవితేజ ముందుకొస్తున్నట్లు తెలుస్తుంది.