బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ రుద్ర అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు డిజిటల్ వెబ్ సిరీస్ లలోకి అడుగు పెట్టారు.
ఇప్పటికే సౌత్ భామలైన తమన్నా, కాజల్ అగర్వాల్, సమంత, ప్రియమణి, హెబ్బా పటేల్ లాంటి అందాల భామలు ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు.అలాగే బాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం డిజిటల్ ఒటీటీ చానల్స్ అన్ని కూడా భారీ బడ్జెట్ తోనే వెబ్ సిరీస్ లని ప్లాన్ చేస్తున్నాయి.కరోనా లాక్ డౌన్ తర్వాత ఒటీటీ చానల్స్ లో ఇండియాలో డిమాండ్ భాగా పెరిగింది.
థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడతానికంటే ఒటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ లు చూడటానికి ఎక్కువగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో డిజిటల్ లో వెబ్ సిరీస్ లకి వస్తున్నా రెస్పాన్స్ తో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ అటువైపుగా దృష్టి పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వెబ్ సిరీస్, ఒటీటీ ఫిలిమ్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో అజయ్ దేవగన్ కూడా రుద్ర వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రుద్ర వెబ్ సిరీస్ ద్వారా ఒకప్పటి సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్, బాలీవుడ్ బ్యూటీ ఇలియానా కూడా ఎంట్రీ ఇస్తుంది.
రుద్రలో అజయ్ దేవగన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇందులో ఆమె కూడా అజయ్ దేవగన్ టీమ్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా అలాగే అతనికి జోడీగా కనిపించనున్నట్లు తెలుస్తుంది.
త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది.