టాలీవుడ్ నటి గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన నడుము అందాలతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది.
అంతేకాకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈ బ్యూటీ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఎదిగింది.మంచి ఫేమ్ లో ఉన్న ఈ బ్యూటీ ఉన్నట్లుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయ్యింది.
టాలీవుడ్ లో తనకు అవకాశాలు కూడా రాలేవు.కారణం చాలా వరకు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందని వార్తలు కూడా వినిపించాయి.కానీ మరో కారణం ఉందని తాజాగా అసలు విషయం బయటపడింది.ఇక ఆ సమయంలోనే ఇలియానా తన శరీర బరువు కూడా పెంచి అందర్నీ ఆశ్చర్య పరిచింది.
గ్లామర్ విషయంలో దెబ్బతిన్నందుకు అవకాశాలు రాలేవని తెలిసింది.కానీ అసలు కారణం మరొకటి ఉందట.
ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఇలియానా గురించి విషయాలు బయటకి తెలిపాడు.ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియా ఇండస్ట్రీలో మొదటి స్థానంలో ఉన్నాడు.ఇక ఇలియానా కు తమిళ నిర్మాతతో జరిగిన కొన్ని గొడవల వల్ల అవకాశాలు కోల్పోయిందట.
ఇక ఆ విషయాల గురించి ప్రసాద్ తెలుపగా.ఇలియానా దేవుడు చేసిన మనుషులు సినిమాలో నటిస్తున్న సమయంలో తనకు తమిళంలో సినిమా అవకాశం వచ్చిందని తెలిపాడు.దీంతో తమిళ నిర్మాత తనను హీరో విక్రమ్ తో నందం అనే సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ చేశాడట.దీంతో ఇలియానా కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రూ.40 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకుందని తెలిపాడు.కానీ అనుకోకుండా కొన్ని కారణాలవల్ల సినిమా ఆగిపోవడంతో అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని తమిళ నిర్మాత కోరడంతో ఇలియానా డబ్బులు ఇవ్వడానికి అంగీకరించలేదని తెలిపాడు.దీంతో ఇలియానా, నటరాజు మధ్య వాగ్వాదం కూడా జరిగిందట.
ఇక నటరాజు తమిళ నిర్మాతలతో సంప్రదించగా అక్కడ ఎటువంటి పరిష్కారం అందలేదట.దీంతో ఏకంగా ఇలియానాను స్టార్ గా మార్చిన సౌత్ ఫిలిం చాంబర్ కు వెళ్లగా అక్కడ కూడా అంగీకరించకపోవడంతో తనను అఫీషియల్ బ్యాన్ కాకుండా సౌత్ సినిమాలకు ఆమెను తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.ఇక ఇటీవలే సినీ ఇండస్ట్రీ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఇక ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో అవకాశం రాగా ఆ సినిమా అంత సక్సెస్ ను అందివ్వలేదు.
ఇక ప్రస్తుతం ఇలియానా మరో సినిమాలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.