తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ ఇలియానా.ఈ అమ్మడు బాలీవుడ్కు ఆమద్య వెళ్లి పోయింది.
అక్కడ అవకాశాలు తగ్గడంతో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది.
అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంకు ఇలియానా ప్లస్ అవుతుందని అంతా భావించారు.కాని షాకింగ్గా ఇలియానా సినిమాకు పెద్ద మైనస్ అయ్యిందని టాక్ వచ్చింది.ఏమాత్రం ఆకట్టుకోని బాడీతో ఆమె కనిపించింది.
ముఖ్యంగా ఇలియానా మొహం బాగా లావు అవ్వడంతో ఆమెకు మునుపటి రూపు లేకుండా పోయిందని విమర్శలు వచ్చాయి.రీఎంట్రీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇలియానా మళ్లీ బాలీవుడ్కు వెళ్లి పోతుందనే వార్తలు వచ్చాయి.
తెలుగులో ఈమెకు ఇక అవకాశాలు రావనుకున్నారు.కాని అనూహ్యంగా మెగా మూవీలో ఇలియానాకు ఛాన్స్ దక్కింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా రూపొందుతున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఆ చిత్రంలో ఒక్క పాట మాత్రం బ్యాన్స్ ఉందట.ఆ పాటను ఇలియానాతో చేయించేందుకు బోయపాటి సిద్దం అయ్యాడు.ఇలియానాకు ఏకంగా 60 లక్షల పారితోషికంగా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.రీఎంట్రీ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఇలియానాకు ఇంత పారితోషికం ఇవ్వడం ఏంటీ అంటూ సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.