వందల సంఖ్యలో సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఇళయరాజా.గత కొన్ని రోజుల నుంచి సోషల్, వెబ్ మీడియాలో ఇళయరాజా తనకు వచ్చిన జాతీయ, రాష్ట్ర అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఇళయరాజాకు, ప్రసాద్ స్టూడియోకు గత కొన్ని సంవత్సరాలుగా వివాదం చెలరేగుతోంది.అయితే వివాదం విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడంతో ఇళయరాజా అవార్డులను వెనక్కు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం అబద్ధమని ఇళయరాజా కీలక వ్యాఖ్యలు చేశారు.తన గురించి వైరల్ అవుతున్న వార్తలు నిరాధారమైనవని.
ఆ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో తనకు తెలియదని.తాను అవార్డులు వెనక్కు ఇస్తున్నానని వార్తలు రావడం తన దృష్టికి కూడా వచ్చిందని పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా ఇళయరాజాకు ప్రసాద్ స్టూడియోస్ కు మధ్య వివాదం జరుగుతోంది.చెన్నై ప్రసాద్ స్టూడియోస్ లోని రికార్డింగ్ థియేటర్ ను వాడుకోవాలని తనకు మాట ఇచ్చారని.అయితే యజమాన్యం మారడంతో ప్రస్తుతం ఉన్న యజమాన్యం తనను రికార్డింగ్ థియేటర్ లోకి అనుమతి ఇవ్వడం లేదని ఇళయరాజా తెలిపారు.ప్రసాద్ స్టూడియోస్ ప్రస్తుత యజమాన్యం తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదం గురించి ఇళయరాజా కోర్టును కూడా ఆశ్రయించారు.తనకు 50 లక్షల రూపాయల పరిహారం ప్రసాద్ స్టూడియోస్ ప్రస్తుత యజమాన్యం చెల్లించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే కోర్టు మాత్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది.కోర్టు సూచనల నేపథ్యంలో ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కారం అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
ఇళయరాజా స్పందించి తన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గాసిప్స్ కు చెక్ పెట్టారు.