వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ.ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం ‘కథలో రాజకుమారి’ చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం ఈ చిత్ర పాటల రికార్డింగ్ మాస్ట్రో ఇళయరాజా నేతృత్వం లో చెన్నై లో జరుపుకుంటోంది.కార్తికేయ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన మాగ్నస్ సినీప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా చెన్నై లో పాటల రికార్డింగ్ కార్యక్రమం లో పాల్గొన్న నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం చిత్ర విశేషాలను తెలియజేస్తూ.“కార్తికేయ లాంటి సూపర్ హిట్ తరువాత మళ్ళీ అంతకుమించిన సక్సెస్ ఫుల్ చిత్రం నిర్మించాలనే ఆలోచనతో ఓ నవ్యమైన కథతో ఈ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం.ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మా అద్రుష్టంగా భావిస్తున్నాం.ప్రస్తుతం ఈ చిత్ర పాటల రికార్డింగ్ ఆయన నేతృత్వం లో చెన్నై లో జరుపుతున్నాం.
ఆల్రెడీ మూడు పాటలు రికార్డింగ్ పూర్తి చేశాం.నూతన సంవత్సరం ప్రారంభం రోజున, జనవరి 1న ఈ చిత్ర పాటల రికార్డింగ్ ప్రారంభం కావడం, 2016 లో ఇళయరాజా గారి మొదటి చిత్రంగా మా చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభం కావడం ఆనందం గా వుంది.
ఈ పాటల రికార్డింగ్ కార్యక్రమం లో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తో పాటు చిత్ర దర్శకుడు మహేష్ సూరపనేని పాల్గొన్నారు.తప్పకుండా ఈ చిత్రం సంగీత పరంగా బిగ్ సక్సెస్ సాదిస్తుందనే నమ్మకం వుంది.నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించనుంది.” అన్నారు.ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: జయేష్ నాయర్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: సాహి సురేష్, సహా నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవ సాయి సత్యనారాయణ, సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం.