ఇప్పటి వరకు ఐకియా సందర్శించిన వారికి కొన్ని ప్రొడక్టుల ధరలు అందుబాటులోనే ఉన్నా, కొన్ని ప్రొడక్టుల ధరలు మాత్రం ఆకాశాన్నంటేవి.అయితే ఐకియా యాజమాన్యం కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది.
మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు 9 వేలకు పైగా ప్రొడక్టులపై కళ్లు చెదిరే ఆఫర్లను అందిస్తోంది.ఫర్నీచర్, గృహోపకరణాల రిటైలర్ అయిన ఐకియా ఇండియా తాజాగా 16 నుండి 39 శాతం వరకు ధర తగ్గింపును ప్రకటించింది.
ఏడాదిన్నర విరామం తర్వాత ధర తగ్గడంతో కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఫర్నిచర్లో లివింగ్ రూమ్ సీటింగ్, బెడ్ రూమ్ ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్, వీటితో పాటు కిచెన్ వేర్, తదితర ఉత్పత్తులపై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తించనుంది.కోవిడ్ మహమ్మారి, పెరుగుతున్న జీవన వ్యయాలు, సప్లై చైన్ అంతరాయాలు, పెరిగిన ద్రవ్యోల్బణం వంటి వాటిపై ఇటీవలి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.దీంతో ధరలు తగ్గిస్తూ IKEA నిర్ణయం తీసుకుంది.గృహోపకరణాలను మరింత సరసమైన ధరల్లో భారతీయ మార్కెట్కు అందుబాటులోకి తీసుకురావడానికి తమ దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా ఈ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ఐకియా తెలిపింది.
ఆఫ్లైన్, ఆన్లైన్ ఆఫర్లకు ఇది వర్తిస్తుందని IKEA ఇండియా సీఈఓ సుసానే పుల్వెరెర్ అన్నారు.ఉత్పత్తి ఖర్చులను వీలైనంత తక్కువగా ఉంచడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నట్లు తెలిపారు.
నిర్మాణ సాంకేతికతలు, పంపిణీ, రవాణా వంటి వాటి కారణంగా IKEA పోటీ ధరలు తగ్గించడానికి కారణమని తెలుస్తోంది.ఈ నిర్ణయంతో సంస్థకు ముంబై, బెంగళూరు, హైదరాబాద్లలో ఉన్న ఐకియా స్టోర్లకు కస్టమర్ల తాకిడి పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.