భారత దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరుగాంచిన ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ సంస్థలు విదేశాలలో సైతం తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.గతంలో ఎన్నడూ భారత వర్సిటీలు విదేశాలలో తమ శాఖలను విస్తరించిన నేపథ్యం లేకపోవడంతో ఐఐటీ , ఢిల్లీ వర్సిటీల ప్రయోగాత్మక విస్తరణపై ఆసక్తి నెలకొంది.
వియారాలలోకి వెళ్తే.
ఈజిప్ట్, సౌదీ అరబియాలో తమ శాఖలను ఏర్పాటు చేయనున్నట్టుగా ఐఐటీ, ఢిల్లీ వర్సిటీల ప్రకటించాయి.
అంతేకాదు అందుకు సంభందించిన దౌత్యపరమైన విషయాలపై చర్చలు కూడా జరుపుతున్నాయి.ఈ చర్చలు గనుకా ఫలిస్తే అతి త్వరలో రెండు దేశాలలో వర్సిటీల శాఖలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
ఇదిలాఉంటే
విదేశాలలో ఏర్పాటు చేయబోయే మన వర్సిటీల శాఖలు పూర్తిగా ఆయా దేశాల ప్రభుత్వ అజమాయిషీ లోనే ఉంటాయి కానీ విద్యార్థుల ఎంపికను, సిలబస్ మాత్రం ఢిల్లీ ఐఐటీ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలుస్తోంది.అయితే విద్యార్థుల ఎంపిక విషయంలో మాత్రం ఇప్పుడున్న ప్రవేశ పరీక్ష కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కలిసి ఉంటుందని తెలుస్తోంది.
అయితే మరొక కండిషన్ ఏంటంటే ఇందులో చదవాలని అనుకునే వారు ఢిల్లీ క్యాంపస్ లో ఒక ఏడాది కోర్సు పూర్తి చేసిన తరువాత మిగిలిన కోర్సు ఆయా దేశాలలో పూర్తి చేసుకోవచ్చు.