సోషల్ మీడియా యాక్టీవ్ అయ్యాక ఎవరి స్థాయి ఎక్కడికి పోతుందో చెప్పడం కష్టంగా మారింది.ఒక్క పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు కొంతమంది.
సినిమాకు ముందే పాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.ఆ పాటలకు సాధారణ మనుషులు వేసే స్టెప్స్ సినిమా విడుదలయ్యాక హీరోలు కూడా వేయరు అన్నంతగా వారి యాక్టింగ్ కనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో నాది నక్కిలీసు గొలుసు అనే పలాస సాంగ్ విడుదలైనా ఎవ్వరు పట్టించుకోలేదు కానీ దుర్గారావ్ అనే వ్యక్తి అదే పాటకు డాన్స్ వేసి ఔరా…అనిపించాడు ఆ పాట అప్పట్లో సంచలం సృష్టించింది.నెట్టింట్లో వైరల్ అయిన ఆ సాంగ్ తో దుర్గారావ్ కు సినిమాల్లో కూడా ఛాన్స్ లు రావడం విశేషం.
ఆ తర్వత బెంగాల్ కు చెందిన బాదం వ్యాపారి పాడిన కచ్చాబాదాం పాట సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే ఆ పాట తో పాట పాడిన వ్యక్తి ఎక్కడికో ఎదిగోపోయాడు.ఇప్పటికి ఆ పాట దేశాన్ని ఊపిస్తుంది.
ఈ మధ్యకాలంలో ఇళయదళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలోని మల్లమా పితా అనే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.ఇలా ప్రతీ సీజన్ లో ఒక సాంగ్ నెట్టింట్లో సంచలం సృష్టిస్తుండగా తాజాగా ఓ అరభిక్ సాంగ్ కు ఒక యువతి వేసిన స్టెప్పులు అందరి చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి.
ఇప్పటికే ఈ పాట 10 కోట్ల, 95 లక్షల మంది వీవర్స్ ను సొంతం చేసుకుంది.నెలకు ముందు విడుదలైన ఈ పాట ఇప్పటికీ అదే క్రేజ్ తో కొనసాగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఈ పాటకు ఇండియాలో సినీ తారలు, సినీ ప్రముఖులు, సినీ పెద్దలు కూడా డాన్స్ లు వేస్తున్నారు.ఇప్పటికే సమంత, కీర్తి సురేష్, రష్మికా, వేదిక,పూర్ణా, రితికా సింగ్ లాంటి టాప్ హీరోయిన్స్ కూడా డాన్స్ వేశారు.
నిత్యం బిజీగా వుండే హీరోయిన్స్ ఈ పాటకు డాన్స్ వేసి సోషల్ మీడియాలో గడపడంతో ఆ పాటకు వున్న క్రేజ్ తెలిసిపోతుంది.తాజాగా ఇదే పాటకు ఒక యువతి వేసిన డాన్స్ ఇన్స్టాగ్రామ్ ను ఊపేస్తుంది.
బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని నడుము కనిపించేలా చిన్న నిక్కర్ వేసుకుని డాన్స్ చేసింది ఆ యువతి.ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హల్ చల్ అవుతుంది.
ఏది ఏమైనా ఈ పాట ట్రెండ్ సెట్ చేస్తుంది.యువతీ యువకులు ఏ పాటకు డాన్స్ వేసినా ఆ సాంగ్ కు ఫ్రీ పబ్లిసిటీ దొరుకినట్టు అవుతుంది.