ప్రపంచ పటంలో ఉత్తర కొరియా ఎక్కడో ఒక మూలన ఉన్నప్పటికీ ఈ దేశం గురించి దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు మాట్లాడుకుంటుంటారు ఎందుకంటే ఈ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏకంగా తమకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తానే దేవుడినని చెప్పుకుంటూ పాలన సాగిస్తూ ప్రజలకు ఆంక్షలను విధిస్తాడు.అయితే ఇప్పటివరకు కిమ్ జాంగ్ ఉన్ విధించిన కఠిన నిబంధనలను ఒకసారి పరిశీలించినట్లయితే మన ఒళ్ళు జలదరించక మానదు.
అయితే ఇందులో ముఖ్యంగా మన దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో ప్రతి ఒక్కరికి టెక్నాలజీ బాగానే అందుబాటులో ఉంటోంది. ఇందుకు కారణం ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్నెట్ సౌకర్యం ఉండడమే.
కానీ ఉత్తర కొరియాలో మాత్రం ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంటర్నెట్ సౌకర్యాలను వినియోగిస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందువల్లే ఇప్పటికీ చాల కార్యాలయాల్లో తమ సమాచారాన్ని భద్ర పరుచుకోవడానికి కాగితాలనే ఎక్కువగా వాడుతుంటారు.
ఇక మామూలుగా యుక్త వయసులో ఉన్నటువంటి యువతీయువకులు అప్పుడప్పుడు వినోదం కోసం శృంగార భరిత తరహా చిత్రాలను చూడడం సహజమే.కానీ ఉత్తర కొరియాలో మాత్రం శృంగార చిత్రాలను చూస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
అంతేకాక ఇప్పటికీ దేశంలోని చాలా గ్రామాల్లో కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఉత్తర కొరియా దేశపు ప్రజలు ఎంతటి దీన పరిస్థితుల్లో నివసిస్తున్నారో అని.
ఇక ఈ దేశం లో ఉన్నటువంటి టెలివిజన్ సంస్థల విషయానికొస్తే కేవలం ప్రభుత్వం నడిపే మూడు టీవీ ఛానళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి.ఒకవేళ దేశ అధ్యక్షుడు కిమ్ గిరించి ఎవరైనా వ్యతిరేకంగా వార్తలు రాసినా, టెలివిజన్ లో ప్రచారం చేసినా వారి జైలు శిక్ష తప్పదు.కాగా ఈ దేశపు కరెన్సీ 500 రూపాయలు భారత దేశపు కరెన్సీ 30 రూపాయలకి సమానం.
మీకు ఎప్పుడైనా టూర్ కి వెళ్లాలనిపిస్తే ఉత్తర కొరియా వైపు ఒక లుక్కేయండి.