అవును, మీరు విన్నది నిజమే.CERT-IN (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) సంస్థ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్లో అనేక కొత్త లోపాలను వేలెత్తి చూపుతోంది.
వీటి కారణంగా మీ కంప్యూటర్లు సైబర్ దాడికి చాలా తేలికగా గురయ్యే అవకాశం కలదని హెచ్చరిస్తోంది.CERT-In వెబ్సైట్లో వచ్చిన సమాచారం ప్రకారం… “మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో అనేక లోపాలు వున్నాయి.
వీటి ద్వారా సైబర్ దాడి చేసేవారు సులభంగా మీ కంప్యూటర్ పై యాక్సిస్ ను పొందేందుకు మీ కంప్యూటర్ పై దాడి చేస్తారు.ఆ లోపాలను ఉపయోగించుకొని రిమోట్ సైబర్ దాడి చేసి సున్నితమైన డేటాను దొంగిలించడానికి యత్నిస్తారు” అని పేర్కొంది.
విండోస్ ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ 109.0.1518.61 కి ముందున్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెర్షన్లు ఈమధ్య కాలంలో గుర్తించిన ఈ లోపాల వల్లనే ప్రభావితం అవుతున్నాయని CERT-IN నివేదిక పేర్కోవడం విశేషం.ఈ లోపలనుండి మీ కంప్యూటర్ల లను రక్షించడానికి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్ యొక్క తాజా వెర్షన్కు మీరు మీ బ్రౌజర్ను అప్డేట్ చేసుకోవాలని CERT-IN వినియోగదారులకు సూచిస్తోంది.మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పటికే ఈ కొత్త వెర్షన్ 109.0.1518.61ని విడుదల చేసింది.ఇది ఈ సమస్యలను పరిష్కరిస్తుందని గుర్తు పెట్టుకోవాలి.
కాబట్టి దానికోసం మీరు తమ కంప్యూటర్లను రక్షించుకోవడానికి దీన్ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.మీ కంప్యూటర్ లో ఈ కొత్త అప్డేట్ అందుబాటులో ఉంటే, వెంటనే అప్డేట్ చేసుకోండి.ఒకవేళ మీ బ్రౌజర్ని అప్డేట్ చేయమని మీకు నోటిఫికేషన్ రాకపోతే, మీరు కొత్త అప్డేట్ కోసం మాన్యువల్గా వెతకాల్సి ఉంటుంది.దానికోసం మీ బ్రౌజర్ యొక్క కుడి పై భాగంలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
ఆ తరువాత సెట్టింగ్స్ లోకి వెళ్లి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గురించి క్లిక్ చేయండి.అక్కడ తాజా అప్డేట్ వెతికి, ఇన్స్టాల్ చేయడానికి బ్రౌజర్ కోసం వేచి ఉండండి.
ఇక కొత్త అప్డేట్ ఇన్స్టాల్ చేయబడిన తర్వాత వెబ్ బ్రౌజర్ను రీస్టార్ట్ చేయండి.