ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అల వైకుంఠపురం సినిమాతో బుట్టబొమ్మగా మారి యువతలో పెద్ద ఎత్తున క్రేజ్ ను సంపాదించుకున్న భామ పూజా హెగ్డే.ఇప్పుడు వరుస విజయాలతో ఆఫర్లు మీద ఆఫర్లు కొల్లగొడుతున్న ఈ భామ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2.5 కోట్ల పారితోషికం తీసుకుంటోంది.రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తూ, ప్రభాస్ సరసన నటిస్తూ ఇతర స్టార్ హీరోల సినిమాలకు ఒకే చెప్పేస్తూ డేట్స్ లాక్ చేస్తోంది.
అయితే ప్రస్తుతం ఆర్థికంగా ఎటువంటి లోటు లేకపోవడంతో తన డ్రీమ్ ను నెరేవేర్చుకోవాలని ప్రయత్నిస్తుందట.ఎప్పటికైనా ముంబైలోని బాంద్రా ఏరియాలో ఓ ఇల్లు కొనుక్కోవాలన్నది పూజా హెగ్డే డ్రీమ్.
ముంబైలోని బాంద్రా ఏరియా అంటే సినీ తారలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు నివసించే ఖరీదైన ఏరియా.అక్కడ ఒక్క ఇల్లు కొనుక్కోవాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.
అయితే అంత ఖరీదైన ఏరియాలో పూజా హెగ్డే మూడు అంతస్తుల కళ్ళు చెదిరే భవంతిని కొనుగోలు చేసి ఇంటీరియర్ తో సహా అన్నింటిని తనే సెలెక్ట్ చేస్తూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది.అందరూ హీరోయిన్లు పాటించినట్టుగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు పూజా హెగ్డే కూడా ఇదే రూల్ ను ఫాలో అవుతుందన్న మాట.