మనదేశ జనాభా 99 శాతం ట్రైన్ జర్నీనే ఇష్టపడుతుంది.ఎందుకంటే ఇక్కడ చిన్నవాళ్ళనుండి పెద్దవాళ్లవరకు ట్రైన్ జర్నీని చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు.
పైగా టిక్కెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయి.మరీ ముఖ్యంగా నైట్ ప్రయాణం అనేది చాలా కూల్ గా సాగిపోతుంది.
అయితే నైట్ ప్రయాణాలు చేయడం మనలో అనేకమందికి ఒక్కోసారి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.ఎందుకంటే మిగతా బెర్తులనుండి వచ్చే గురకల సౌండ్, ఫోన్లో గుసగుసలు, పెద్దగా పాటలు వినబడటం అనే అంశాలు ఒకింత డిస్టర్బ్ చేస్తాయి.
ఇవన్నీ ట్రైన్ జర్నీలో ఇరిటేటింగ్గా అనిపిస్తాయి.
ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని మార్పులు చేస్తోంది.
అవును, రాత్రిపూట ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా నిబంధనలను మార్చబోతోంది.రాత్రిపూట కంపార్ట్మెంట్ లోపల, వెలుపల నిద్రిస్తున్నప్పుడు కోచ్లో ఇతరులతో బిగ్గరగా మాట్లాడటం, బిగ్గరగా సంగీతం వినడం లేదా కాల్లో మాట్లాడటం, పెద్దగా గురకపెట్టడం చేస్తుంటారు.
ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కంపార్ట్మెంట్ లోపల, వెలుపల శబ్దం చేయకూడదని రైల్వే ప్రజలకు కఠినమైన సూచనలు చేసింది.దీనికి సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
ఈ నిబంధనలు త్వరలో అమలులోకి రానున్నాయి.
ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానా పడుతుంది.అవును, ఇకనుండి రాత్రి సమయాల్లో సంగీతం వినడానికి, బిగ్గరగా మాట్లాడటానికి, శబ్దం చేయడానికి లేదా కాల్లో బిగ్గరగా మాట్లాడటానికి అనుమతి ఉండదు.ప్రయాణికులు సులువుగా నిద్రపోయేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది.
ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ప్రయాణం ప్రశాంతంగా ఉండడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.ఎవరైనా ప్రయాణీకుడు మరో ప్రయాణికుడికి ఇబ్బందిని కలిగిస్తే చర్య తీసుకోవడంతోపాటు వారికి జరిమానా విధిస్తారు.