కర్ణాటకకు చెందిన బుల్లితెర నటి హేమ శ్రీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈమె మరణించడంతో గతంలో బాగా మిస్టరీగా మారింది.
ఆమెను హత్య చేసినట్లు తేలగా ఆమె హత్యకు కారణం ఆమె భర్త, మరొక రాజకీయ నాయకుడు అని బాగా పేర్లు వినిపించాయి.ఇదిలా ఉంటే హేమ శ్రీ ఎలా చనిపోయిందో తెలిస్తే మాత్రం ఘోరం అనకుండా ఉండలేరు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.
తాను బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె కొన్నేళ్ల కిందట అనుమానాస్పద రీతిలో హత్యకు గురైంది.ఇక ఈమె మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.
ఈమెపై క్లోరోఫామ్ ఉపయోగించి ఊపిరి అందకుండా ప్రాణాలు తీశారని గతంలో వార్తలు వినిపించాయి.
బెంగళూరు హెబ్బాల పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేపట్టగా పలు విషయాలు బయటపడ్డాయి.
ఆమెకు వైద్యం అందించిన విక్టోరియా ఆస్పత్రి వైద్యులను విచారించారు.తను ఎన్ని గంటలకు హత్యకు గురైందని.
ఆమెకు ఎంత పరిమాణంలో క్లోరోఫామ్ ను ఉపయోగించారన్న విషయాలపై క్లారిటీ ఇవ్వాలని కోరారు.
అంతేకాకుండా హేమశ్రీ భర్త సురేంద్ర బాబు ను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు.
అలా కొన్ని విషయాలు బయట పడగా ఓ మంత్రి గారి కోరిక తీర్చేందుకు సహకరించినందుకు ఆమెను హత్య చేసినట్లు తెలిసింది.ఆమెకు కావాలనే క్లోరోఫామ్ ఎక్కువ మోతాదులో ఇవ్వటంతో ఆమె చనిపోయిందని తెలిసింది.
ఇంతకీ అసలేం జరిగిందంటే.అనంతపురంలోని మూడో డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ మురళీధర్ కూతురు పుట్టినరోజు వేడుకలకు నటి హేమశ్రీ ని ఆహ్వానించారట.
అక్కడ ఓ మంత్రి తన కోరిక తీర్చి దానికి ప్రతిఫలంగా ఏదైనా కీలకమైన పని చేయించుకోవాలని మురళీధర్ తో కోరాడట ఆ మంత్రి.
మరో మాజీ కార్పొరేటర్ ఇదంతా ప్లాన్ చేసినట్లు తెలిసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు.ఇక హేమశ్రీ భర్త సురేంద్ర బాబు తో కూడా పాత పరిచయాలు ఉండటంవల్ల ఆ దంపతులను బర్త్ డే వేడుకలకు ఆహ్వానించారని తేలింది.దాంతో ఆ రోజు సాయంత్రం హేమ శ్రీ, సురేంద్రబాబు మురళీధర్ ఇంటికి వేడుకలకు హాజరయ్యారట.
ఇక ఆ పుట్టినరోజు వేడుకలు ముగిశాక హేమ శ్రీ, సురేంద్రబాబు లను రెడ్డి పెళ్లి ఫామ్ హౌస్ లో వారికి బస ఏర్పాట్లు చేశామని వాళ్లని అక్కడికి పంపించారట.హేమశ్రీ భర్త సురేంద్ర బాబు తో ఆ మంత్రి ఒప్పందం కుదుర్చుకున్నాడట.
దాంతో హేమ శ్రీ ని తన భర్త సురేంద్ర బాబు ఓ మంత్రి కోరిక తీర్చేందుకు వెళ్లాలని డిమాండ్ చేశారని తెలిసింది.
ఆమె నిరాకరించడంతో ఆమెపై క్లోరోఫామ్ ఎక్కువ మోతాదులో ప్రయోగించారని దాంతో ఆమెను తన భర్త అదే రాత్రి సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయిందని అనడంతో అప్పటికే ఆమె మరణించిందని తెలిసింది.
ఆ తర్వాత పోస్టుమార్టం చేయడంతో పోలీసులకు అనుమానం రావడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.దాంతో అసలు నిజాలు బయట పడ్డాయి.
ఇక ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతోమంది ఆమె ఘోరంగా చనిపోయింది అంటూ బాధ పడ్డారు.