జంక్ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేస్తూ స్మార్ట్ ఫోన్లతో గడపటం, మారిన జీవన శైలి, మద్యపానం, ధూమపానం వంటి రకరకాల కారణాల వల్ల స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది భారీగా బరువు పెరిగిపోతున్నారు.ఈ పెరిగిన బరువు కారణంగా మధుమేహం, గుండె పోటు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు సంక్రమించే అవకాశాలు పెరిగిపోతుంటాయి.
అందుకే బరువు తగ్గడం కోసం నానా తంటాలు పడుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే పొడిని ప్రతి రోజు వాటర్లో కలిపి తీసుకుంటే.
ఎంత లావుగా ఉన్న వారైనా సన్నగా మల్లె తీగలా మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడి ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో అర కప్పు సోంపు గింజలు, పదిహేను యాలకులు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, అంగుళం దాల్చిన చెక్క, చిన్న ములేటి ముక్క వేసుకుని వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న పదార్థాలను చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక వాటిని మిక్సీ జార్లో వేయాలి.అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల డ్రై జింజర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జాజికాయ పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే.
బరువు తగ్గించే అద్భుత పొడి సిద్ధమైనట్లే.ఈ పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు.
ఒక గ్లాస్ హాట్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై ఆ నీటిని సేవించాలి.ఇలా ప్రతి రోజు ఉదయాన్నే చేస్తే చాలా వేగంగా బరువు తగ్గుతాయి.అదే సమయంలో బాడీ డిటాక్స్ కూడా అవుతుంది.