మామూలుగా మనం కుళాయి తిప్పితే నీళ్లు వస్తాయి.అయితే ఓ చోట మాత్రం నీళ్లు రావడం లేదు.
పెట్రోల్, డీజిల్ వస్తుండటంతో అందరూ షాక్ అవుతున్నారు.ప్రజలు తాము నీళ్లు కోసం ట్యాప్ వాటర్ వాడతారు.
అలా ఓ ప్రాంతంలో నీళ్ల కోసం ట్యాప్ తిప్పగా వారికి పెట్రోల్, డీజిల్ వచ్చాయి.దీంతో వారు అవాక్కయ్యారు.
ఇలాంటివి దుబాయ్ లోనే ఎక్కువగా జరుగుతాయి.కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రాంతంతో ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఈ ఘటన కలకలం రేపింది.విశాఖపట్నంలోని గోపాలపట్నం, రామకృష్ణ నగర్ లో ట్యాప్ వాటర్ కోసం ఆన్ చేయగా అక్కడ పెట్రోల్, డీజిల్ వచ్చింది.
ఆ ప్రాంతంలో బోర్ నీళ్లలో పెట్రోల్ కలవడంతో ఇలా జరిగింది.నేటి రోజులలో భూగర్భ జలాలు అనేవి పొల్యూట్ అయిపోతున్నాయి.
ఈ ప్రాంతంలో ఓ ఐదేళ్లుగా మున్సిపల్ నీళ్లు వస్తున్నాయి.అయితే ఈ నీళ్లనే ప్రజలు అన్నీ అవసరాలకు వినియోగిస్తున్నారు.
సొంత బోర్లు ఉన్నా కూడా చాలామంది మున్సిపల్ బోర్లను వినియోగిస్తున్నారు.తాము ట్యాప్ తిప్పితే పెట్రోల్ లేదా డీజిల్ రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.స్థానికంగా ఉండేటటువంటి పెట్రోల్ బంకుల వల్లే ఇలా జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.ఇలాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు చేసినా కూడా వారి సమస్య అనేది తీరడం లేదు.
విశాఖపట్నంలో 91వ వార్డులోని రామకృష్ణ నగర్ లోని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.ఆ ప్రాంతంలోనే ఈసమస్య అధికంగా ఉంది.
బోర్ నుంచి వచ్చేటటువంటి నీళ్లలో డీజిల్, పెట్రోల్ కలిసి రావడం వల్ల వాళ్లు నీళ్లు కూడా తాగలేక పోతున్నామని వాపోతున్నారు.తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఆ ప్రాంతంలో బోర్ వేస్తే చాలు నురగతో కూడిన డీజిల్ వస్తోంది.దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు జీవీఎంసీ మున్సిపల్ నీళ్లతోనే తమ ఇళ్లకు వాడుకుంటున్నారు.